AP News:గాజు గ్లాసుకు,సైకిల్‌కి ఓటు వేయాలని కోరుతూ యువనేత ప్రచారం

దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కుమారుడు సందీప్ ఆయన తరపున మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Update: 2024-04-30 13:26 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కుమారుడు సందీప్ ఆయన తరపున మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొబ్బరి తోట , నేతాజీ నగర్ , అచ్చియ్యమ్మ పేట, జెండా చెట్టు ,భూపేష్ నగర్ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొని, స్థానిక ప్రజలను తన తండ్రి వంశీకృష్ణకి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ భరత్‌ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే సంక్షేమ పథకాలు మరింత బాగా అమలు అవుతాయని, అభివృధ్ది పనులు జరుగుతాయని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రహదారులు, డ్రెయిన్లు వంటి సమస్యలకు కూడా ఇప్పటికే పరిష్కారం దొరక్కపోవడం బాధాకరమని, కూటమికి ఓటు వేసి ప్రగతికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేనపెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News