పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పది మందికి గాయాలు

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది.

Update: 2023-04-20 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లొకి దూసుకెళ్లిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లగా 10 మందికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News