కాలువలో పడి వృద్ధుడు మృతి..!

దిశ, దుబ్బాక : ప్రమాదావశాత్తు కాలు జారి కాలువలో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్‎లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామాయంపేటకు చెందిన కుర్ర రాములు అనే వృద్ధుడు.. తన కూతురు డెలివరీ అయిన సందర్భంగా రెండు రోజుల క్రితం తిరుమలాపూర్‎కు వచ్చాడు. శుక్రవారం బాత్‎రూమ్ వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రాములు.. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. రాములు […]

Update: 2020-09-12 08:32 GMT

దిశ, దుబ్బాక : ప్రమాదావశాత్తు కాలు జారి కాలువలో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్‎లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామాయంపేటకు చెందిన కుర్ర రాములు అనే వృద్ధుడు.. తన కూతురు డెలివరీ అయిన సందర్భంగా రెండు రోజుల క్రితం తిరుమలాపూర్‎కు వచ్చాడు. శుక్రవారం బాత్‎రూమ్ వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రాములు.. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. రాములు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News