ప్రవేశ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు చివరి వారంలో లేదా, సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంలో ఈ నెల 14న విచారణ ఉందని ఏఐసీటీఈ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది హైకోర్టు.

Update: 2020-08-10 05:35 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు చివరి వారంలో లేదా, సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంలో ఈ నెల 14న విచారణ ఉందని ఏఐసీటీఈ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది హైకోర్టు.

Tags:    

Similar News