కారు, బైక్ ఢీ.. యువకుడు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా చంద్రగరి మండలం ఐతేపల్లిలో రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు చంద్రగిరి మండలం డోర్నకంబాలకు చెందిన అమర్నాథరెడ్డిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2021-01-25 21:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా చంద్రగరి మండలం ఐతేపల్లిలో రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు చంద్రగిరి మండలం డోర్నకంబాలకు చెందిన అమర్నాథరెడ్డిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News