IPL 2023: చివర్లో విధ్వంసం సృష్టించిన శార్దూల్, గుర్బాజ్.. ఆర్సీబీ టార్గెట్ ఇదే..

Update: 2023-04-06 16:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. తొలుత వికెట్లు కొల్పోయి ఇబ్బందుల్లో పడగా.. కేకేఆర్‌ను శార్దూల్ (68), గుర్బాజ్(57), రింకు సింగ్ (46) పరుగులతో ఆదుకున్నారు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లుకు 204 రన్స్ చేసింది. చివర్లో శార్దూల్, రింకు సింగ్ వీర విహారం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో విల్లే, శర్మ చెరో 2, సిరాజ్, బ్రెస్‌వెల్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News