IPL 2023: రొసౌ విధ్వంసం.. పంజాబ్‌ టార్గెట్‌ ఇదే

Update: 2023-05-17 16:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రొసౌ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్‌ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్‌ వార్నర్‌ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్‌లో శామ్ కరన్ 2 వికెట్లు తీశాడు.

Tags:    

Similar News