IPL 2023: మ్యాక్స్‌వెల్‌ హాఫ్ సెంచరీ..

IPL 2023లో భాగంగా ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.

Update: 2023-05-09 15:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌  అర్థసెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీకి మ్యాచ్ ఆదిలోనే షాక్‌ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన రన్ మిషన్ విరాట్ కోహ్లి. బెహండార్ఫ్‌ బౌలింగ్‌లో కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మరో బ్యాటర్ అనూజ్‌ రావత్‌ ఆరు పరుగులు వద్ద బెహండార్ఫ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 44 పరుగులతో ఆడుతున్నాడు.

Tags:    

Similar News