ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్లు దూరం.. ప్లే ఆఫ్ రేసు ముందు ఈ జట్లకు భారీ షాక్

ఐపీఎల్ 2024 సీజన్ హిస్టరీ క్రియేటింగ్ మ్యాచులతో నడుస్తుంది. ఇప్పటికే సగానికి కంటే ఎక్కువ మ్యాచులు ఐపోగా.. మొత్తం పది జట్లలతో 8 జట్లు ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతున్నాయి.

Update: 2024-04-30 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ హిస్టరీ క్రియేటింగ్ మ్యాచులతో నడుస్తుంది. ఇప్పటికే సగానికి కంటే ఎక్కువ మ్యాచులు ఐపోగా.. మొత్తం పది జట్లలతో 8 జట్లు ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ లో కీలక మ్యాచులకు ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరం కానున్నారు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లపై ఆధారపడిన జట్లు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. మే 22 నుంచి ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ ముందు జరగనున్న ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ టీ20 జట్టునే పంపాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో ఆయా జట్ల లో కీలకంగా ఉన్న జోస్ బట్లర్, జానీ బెయిర్స్టో, సాల్ట్, సామ్ కరన్, లివింగ్ స్టోన్, మోయిన్ అలీ.. మే 22 కంటే ముందే ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. దీంతో కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఈ ప్లేయర్లు లేకపోవడం వల్ల రాజస్థాన్, కలకత్తా పంజాబ్ జట్లు తీవ్రంగా నష్టపోనున్నాయి. కాగా మే 21 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

Similar News