దూసుకొచ్చిన లారీ... ప్రైవేట్ లేబర్ దుర్మరణం

విజిల్ కొడుతూ... సరకు రవాణా చేసే లారీలను ఆపే వ్యక్తి పైకి గుర్తు తెలియని లారీ దూసుకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Update: 2024-05-02 15:55 GMT

దిశ, భిక్కనూరు : విజిల్ కొడుతూ... సరకు రవాణా చేసే లారీలను ఆపే వ్యక్తి పైకి గుర్తు తెలియని లారీ దూసుకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... 44వ నెంబర్​ హైవేపై ఉన్న ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన అర్కల వెంకట్(39) రోడ్డుపై నిలబడి విజిల్ కొడుతుండగా గుర్తుతెలియని వాహనం ఆయన పైకి దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకట్

    అక్కడిక్కడే మృతి చెందగా, మృతదేహం తునాతునకలైంది. మృతుడు వెంకట్ ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ప్రైవేట్ లేబర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ ను దిశ వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని, అందుకు కారణమైన లారీ కోసం రెండు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. మృతుని కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు.  

Similar News