ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం
ఏపీ విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: ఏపీ విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం చేశాడు. నర్సు ఒక్కసారిగా కేకలు వేయడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిందితుడిని వెంటనే పట్టుకుని పోలీసులకు బంధువులు అప్పగించారు. నిందితుడిని గట్యాడకు చెందిన గోపిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.