గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, ఈదుల గట్టెపల్లి
దిశ,మానకొండూరు : కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, ఈదుల గట్టెపల్లి, కాకతీయ కాలువ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు.ఆచూకీ తెలిసిన వారు మానకొండూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.