మంజీరాలో గుర్తుతెలియని యువకుని మృతదేహం లభ్యం

కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని దుర్గా వైన్స్​ సమీపంలో మంజీరా నదిపై ఉన్న మొదటి బ్రిడ్జి వద్ద నీటిమడుగులో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు.

Update: 2024-04-16 12:54 GMT

దిశ, కొల్చారం : కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని దుర్గా వైన్స్​ సమీపంలో మంజీరా నదిపై ఉన్న మొదటి బ్రిడ్జి వద్ద నీటిమడుగులో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ ముహమ్మద్, మెదక్ రూరల్ సీఐ కేశవులు సందర్శించి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుని వయస్సు సుమారు 28 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. బిస్కట్ కలర్ హాఫ్ బనియన్, బ్లూడ్రాయర్, కుడిచేతిపైన స్టార్ నమూనా గల పచ్చ బొట్టు ఉందన్నారు. మంజీరా ఒడ్డున చేపలు పట్టే గాలం ఉన్నట్టు తెలిపారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయినట్టు భావిస్తున్నారు. మృతుడి గురించి వివరాలు తెలిస్తే 8712657919(SIP కుల్చారం), 8712657916 (CIP మెదక్ రూరల్) కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. 

Similar News