40శాతం మంది ట్రాఫిక్ రూల్స్ బ్రేకర్సే..!
దిశ, ఏపీబ్యూరో: ఓ వైపు భారీ జరిమానాలు విధిస్తున్నా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లు ఏపీలో 40 శాతం మంది ఉన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్పోర్టు రీసెర్చి వింగ్ శుక్రవారం ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వాటి కారణాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల వల్లే రోజుకు తొమ్మిది మంది ప్రమాదాల […]
దిశ, ఏపీబ్యూరో: ఓ వైపు భారీ జరిమానాలు విధిస్తున్నా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లు ఏపీలో 40 శాతం మంది ఉన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్పోర్టు రీసెర్చి వింగ్ శుక్రవారం ఓ నివేదిక వెల్లడించింది.
మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వాటి కారణాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల వల్లే రోజుకు తొమ్మిది మంది ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని నివేదికలో పేర్కొంది. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36మంది దుర్మరణం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట ప్రభుత్వం చలానాలను భారీగా పెంచినట్లు సమర్ధించుకుంది.