ఎన్‌‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

దిశప్రతినిధి, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకి తూటా పేలింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం కాగా, అందులో ఇద్దరు మహిళా సభ్యురాళ్లు ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అనంతరం ఘటనా స్థలంలో 8ఎంఎం తుపాకీ, పేలుడు పదార్థాలు, కిట్ […]

Update: 2020-09-23 09:58 GMT

దిశప్రతినిధి, ఖమ్మం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకి తూటా పేలింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం కాగా, అందులో ఇద్దరు మహిళా సభ్యురాళ్లు ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అనంతరం ఘటనా స్థలంలో 8ఎంఎం తుపాకీ, పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు చర్ల మండలాన్ని జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News