Urvashi Rautela: భారత్ vs పాక్ మ్యాచ్.. గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ

Update: 2023-10-15 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా భారత్ vs పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌటెలా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ బిగ్ మ్యాచ్‌కు హాజరైన ఊర్వశి రౌటెలా.. తన అందచందాలతో సందడి చేసింది. లక్షా 30 వేల మంది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఈ బాలీవుడ్ బ్యూటీ.. బ్లూ టాప్‌లో తన అందాలతో మెరిసి కనువిందు చేసింది. ఈ క్రమంలోనే ఆమె తన ఐఫోన్‌ను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి రౌటెలానే ఎక్స్‌ వేదికగా తెలియజేసింది. ఈ విషయంలో ఎవరైనా తనకు సాయం చేయాలని, మొబైల్ కనిపెట్టాలని విజ్ఞప్తి చేసింది.

'నా 24 క్యారెట్ల రియల్ గోల్డ్ ఐఫోన్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పోయింది. ఎవరికైనా అది కనబడితే దయచేసి సాయం చేయండి. వీలైనంత త్వరగా నన్ను కాంటాక్ట్ అవ్వండి.'అని #LostPhone #AhmedabadStadium, #HelpNeeded #indvspak హ్యాష్ ట్యాగ్‌లతో మోదీ స్టేడియం, అహ్మదాబాద్ పోలీసులకు ఊర్వశి ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News