ICC World cup 2023: గిల్, కోహ్లీ హాఫ్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్

Update: 2023-11-02 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World cup 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. ఆదిలోనే రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయినా మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు అర్థ సెంచరీలు పూర్తి చేసి సెంచరీల దిశగా సాగుతున్నారు. 26 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్‌.. ఒక వికెట్‌ నష్టానికి 161 పరుగులు చేసింది. కోహ్లీ (81 నాటౌట్‌), గిల్‌ (67 నాటౌట్‌) లు క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News