మరోసారి ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా 

by  |
Amit Shah
X

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి అమిత్ షా మరోసారి ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య సమస్యతో శనివారం రాత్రి 11 గం.లకు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్నారు అమిత్ షా. కాగా మరోసారి ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు ఆయనకీ చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా… నెహ్రూ నిర్మించిన ఎయిమ్స్ లో అమిత్ షా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ కి బీజేపీ శ్రేణులు కౌంటర్ ఇస్తూ… అమిత్ షా.. భారత్ లో నిర్మించిన ఎయిమ్స్ ని నమ్ముతుంటే… సోనియా మాత్రం విదేశీ ఆసుపత్రుల చికిత్సపై ఆధారపడటం బాధాకరం అని విమర్శిస్తున్నారు.

Read Also…

నేడే నీట్ : అభ్యర్థులకు కొత్త నిబంధనలు

Next Story

Most Viewed