ట్రాక్టర్ ఎక్కిన అడిషనల్ కలెక్టర్.. వ్యాక్సిన్ పై వారికి భరోసానిచ్చి!

by  |
ట్రాక్టర్ ఎక్కిన అడిషనల్ కలెక్టర్.. వ్యాక్సిన్ పై వారికి భరోసానిచ్చి!
X

దిశ, జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామానికి బుధవారం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులతో కలిసి వెళ్లారు. జన్నారం గోండుగూడ మధ్య ఉన్నటువంటి వద్ద వాగు ప్రవహిస్తుండటంతో ట్రాక్టర్ ఎక్కి వాగు క్రాస్ చేశారు. ఆ తర్వాత కాలినడకన గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు.

వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల స్పెషల్ అధికారి శంకర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో రమేష్, సర్పంచ్ గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ రియాజుద్దీన్లు ఉన్నారు.


Next Story

Most Viewed