- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ట్విస్ట్ !
<p>దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: చంచల్గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్న రిమాండ్ ఖైదీ మాజీ తహసీల్దార్ కేసులో సరికొత్త ట్విస్ట్ నడుస్తోంది. నాగరాజు బినామీగా గుర్తించిన బొల్లారానికి చెందిన నందగోపాల్ నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. ఆగస్టు 14న రియల్టర్ల నుంచి రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెల్సిందే. ఈ కేసులో నాగరాజుతో పాటు వీఆర్ఏ సాయి, రియల్టర్ శ్రీనాథ్, […]</p>

దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: చంచల్గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్న రిమాండ్ ఖైదీ మాజీ తహసీల్దార్ కేసులో సరికొత్త ట్విస్ట్ నడుస్తోంది. నాగరాజు బినామీగా గుర్తించిన బొల్లారానికి చెందిన నందగోపాల్ నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. ఆగస్టు 14న రియల్టర్ల నుంచి రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెల్సిందే. ఈ కేసులో నాగరాజుతో పాటు వీఆర్ఏ సాయి, రియల్టర్ శ్రీనాథ్, ఏజెంట్ అంజిరెడ్డిలను అరెస్టు చేశారు. ఇదే సమయంలో కీసర మండలం రాంపల్లి గ్రామంలో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులకు మరో 26 ఎకరాల భూమి పాస్బుక్లు ఇచ్చేందుకు ప్రాసెస్ సిద్దం చేశాడనే ఆరోపణలతో నాగరాజుపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. వీటిలో మొదటి కేసు కస్టడీ విచారణ పూర్తికాగా, రెండో కేసులో నాగరాజు మరణించే నాటికి కస్టడీ కొనసాగుతోంది.






