- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో శుక్రవారం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ తో వేసిన కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య – పరిష్కారం, తెలంగాణలో జిల్లాల వారీగా పోడు భూముల వివరాలు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడు భూములపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. త్వరలోనే గిరిజనుల సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.