- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల వేళ కాంగ్రెస్కు BIG షాక్.. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన సిట్టింగ్ MP
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ ఎన్నికల జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్గా తీసుకొని గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. రెండు స్థానాలకు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఊపు మీదున్న కాంగ్రెస్కు ఎన్నికలకు ముందే బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో మొట్టమొదట చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన వెంకటేష్ నేత.. కాంగ్రెస్లోనూ మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన అధిష్టానం.. వెంకటేష్ నేత చేరితే గోమాస శ్రీనివాస్ను బుజ్జగించి అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు.