భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య..

by Disha Web Desk 23 |
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య..
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని అంకుశపూర్ గ్రామానికి చెందిన మేంగ్రే గౌరీ బాయి 36. భర్త వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం భర్త తిరుపతి తరుచూ మద్యం తాగి వచ్చి గొడవ పడేవాడు. ఇదే క్రమంలో గురువారం భార్య గొంతు పట్టి కడుపులో తన్నడంతో గౌరీ బాయి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల మాక్స్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మింగే తిరుపతి పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Next Story

Most Viewed