- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముగ్గురు రిమాండ్..
దిశ,చంపాపేట్ : ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను ఐఎస్. సదన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఒక కత్తి, ఐరన్ రాడ్, స్టిక్, ద్విచక్ర వాహనం, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం... బడంగ్ పేట్ ప్రాంతానికి చెందిన నదిరి సాయి కుమార్ (26) కార్ల క్రయ విక్రయాల వ్యాపారం చేస్తుంటాడు. కాగా సాయి కుమార్ 2022 లో తన సోదరి వివాహం కోసం పెద్ద నాన్న నదిరి శ్రీశైలం కుమారుడైన కానిస్టేబుల్ మహేష్ కుమార్ వద్ద రూ.2 లక్షలను తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో ఈ నెల 18వ తేదీన మహేష్ కుమార్ సాయి కుమార్ ఇంటికి వెళ్లాడు.
సాయి కుమార్ ను మహేష్ కుమార్ ఓవైసీ కాలనీలోని శ్మశాన వాటిక ప్రాంతానికి తీసుకొచ్చాడు. అప్పటికే మహేష్ కుమార్ తండ్రి శ్రీశైలం, సోదరుడు జగదీశ్వర్లు అక్కడే ఉన్నారు. దీంతో సాయి కుమార్ అక్కడికి చేరుకోగానే మహేష్ కుమార్, శ్రీశైలం, జగదీశ్వర్లు కట్టెలతో దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సాయి కుమార్ స్నేహితున్ని సైతం కట్టెలతో కొట్టి గాయపరిచారు. అనంతరం సాయి కుమార్ చంద్రయ్య గుడిసెల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై బాధితుని తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన శ్రీశైలం, జగదీశ్వర్, మహేష్ కుమార్ ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Read More..
తప్పుడు ధ్రువపత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు అరెస్టు