మాటల్లో దింపి బంగారు గొలుసు అపహరణ

by Disha Web Desk 15 |
మాటల్లో దింపి బంగారు గొలుసు అపహరణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యంను రోడ్డుపై ఆరబోసి దానికి కాపాలా కాస్తున్న మహిళా రైతుకు చెందిన బంగారు గొలుసును దొంగలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం మధ్యహ్నం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో జరిగింది. కంజర్ గ్రామానికి చెందిన మహిళా రైతు అరికేల లక్ష్మి కంజర్ - మోపాల్ రహదారిపై ధాన్యంను ఆరబోసి కాపలా ఉంది.

అక్కడ ఒంటరిగా ఉన్న లక్ష్మిని చూసి స్కూటీపై వచ్చిన ఇద్ధరు అగంతకులు ఆమెను మాటల్లో దింపి మెడలోని 3 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారీ అయ్యారు. బోర్గంకు వెళ్లే దారిలో బైక్ పై పరారీ అయిన అగంతకుల కోసం మహిళా రైతులు కేకలు వేస్తూ పరిగెత్తినప్పటికీ వారు పరారీ అయ్యారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మోపాల్ పోలీస్ లు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.


Next Story

Most Viewed