వ్యక్తి అనుమానాస్పద మృతి..

by Disha Web Desk 23 |
వ్యక్తి అనుమానాస్పద మృతి..
X

దిశ, సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలం లోని మొండ్రాయి గ్రామానికి చెందిన పాక రవి (45) ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాక రవి కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రైతు వేదిక (జొన్న బోడు) సమీప దూరంలో శివరాత్రి రమేష్ కు చెందిన చెలకలో పడి మృతి చెంది కనిపించాడు. చెలకకి పల్టర్ కోసం వెళ్లిన రమేష్ మృతి చెందిన రవిని చూసి చుట్టుపక్కల వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నరేష్ పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని సాధారణమైన మరణమా లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed