బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ప్రయాణికుల దాడి

by Disha Web Desk 15 |
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ప్రయాణికుల దాడి
X

దిశ,అశ్వాపురం : అశ్వాపురం మండలంలోని కళ్యాణపురం గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ పై ప్రయాణికులు దాడి చేశాడు. తోటి ప్రయాణికులు చెప్పిన వివరాల మేరకు ఖమ్మం మీదుగా వస్తున్న బస్సులో కళ్యాణపురం గ్రామస్తులు ఎక్కారు. స్టాప్ వద్దకు రాగానే బస్ డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్లాడు. దాంతో ప్రయాణికులకి, బస్ డ్రైవర్, కండక్టర్​ మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం కళ్యాణపురం గ్రామంలో బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేసి దుర్భాషలాడుతూ డ్రైవర్ పై, కండక్టర్ పై చేయి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను చెదరగొట్టి బస్సును స్టేషన్ కు తరలించారు. డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story