యూఎస్‌లో రోడ్డు ప్రమాదం..తెలంగాణ విద్యార్థులు మృతి

by Disha Web Desk 12 |
యూఎస్‌లో రోడ్డు ప్రమాదం..తెలంగాణ విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు మృతి చెందారు. యూఎస్ లోని అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు తమ కారులో వెళుతుండగా వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపళ్లి గ్రామానికి చెందిన పార్సి గౌతం కుమార్ (20), మరొకరు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన నివేశ్‌గా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల కుటుంభాల్లో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశానికి పంపిస్తే తమ కుమారులు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story