ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by Disha Web Desk 4 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వంతెనపై నుంచి బస్సు కింద పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ప్రమాదంలో 40 మందికి గాయాలు అయ్యాయి. పూరీ నుంచి కోల్‌కతా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. నేషనల్ హైవే -16 పై ఉన్న బారబతి బ్రిడ్జిపై ఈ ఘటన రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను కటక్ ఎస్ సీబీ మెడికల్ కాలేజ్ కు చికిత్స కోసం తరలించినట్లు ధర్మశాల పోలీసు స్టేషన్ ఇన్ చార్జి తపన్ కుమార్ నాయక్ తెలిపారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సీఎం నవీన్ పట్నాయక్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.


Next Story

Most Viewed