కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య

by Disha Web Desk 15 |
కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య
X

దిశ, తాడ్వాయి : చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దేనికలాన్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంకల్ గ్రామానికి చెందిన కౌడి శ్రీశాంత్(23)కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇంటర్ పూర్తి చేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో కుటుంబ సభ్యులు మందలించారు.

దాంతో మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శశాంత్ తిరిగి ఇంటికి రాకపోవడంతో దగ్గరి బంధువులకు, చుట్టుపక్కల గ్రామాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. అనంతరం గొల్ల భూషయ్య వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్సై సంజీవులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.


Next Story