నీటి సంపులో పడి బాలుడు మృతి

by Disha Web Desk 23 |
నీటి సంపులో పడి బాలుడు మృతి
X

దిశ,మేడిపల్లి : వేసవి కాలం స్నానం చేయడం కోసం నీటి సంపు దగ్గరకు సరదాగా వెళ్లిన బాలుడు శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోపాలు బోయిన రమేష్ అనే యజమానికి చెందిన ఇటుక బట్టిలో కూలి పని చేయడానికి ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన బైగాన్ సాంబార్ అనే మహిళ గత నాలుగు నెలల క్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చింది. గురువారం బైగాన్ సాంబార్ కుమారుడు పరమేశ్వర్ (7 )స్నానం చేయడం కోసం వెళ్లి నీటి సంపులో మునిగి మరణించాడు.

మృతుడు పరమేశ్వర్ గురువారం రాత్రి సమయంలో ఇటుక బట్టిలోని ఇతర పిల్లలతో కలిసి తన నివాసం ముందే గల వాటర్ హౌస్ వద్దకు స్నానం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాటర్ హౌస్ లో పడిపోగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించి వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ పరిశీలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed