- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీటి సంపులో పడి బాలుడు మృతి..
దిశ,చండూరు: నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన మండల పరిధిలోని నెర్మట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన నారపాక జంగులు, సంతోష కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. చిన్న కుమారుడు అక్షయ్( 4) ప్రతిరోజు అంగన్వాడి స్కూల్ కు వెళ్లేవాడు.
ఆదివారం సెలవు దినం కావడంతో స్కూల్ కి వెళ్లలేదు. తల్లిదండ్రులు ఇద్దరు దినసరి కూలి కావడంతో పనికి వెళ్లారు. చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటూ తమ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు నీటి సంపులోకి దిగి బయటికి తీసేసరికి బాలుడు అప్పటికే చెందినట్లు గుర్తించారు. కొడుకు మృతి చెందడంతో బాలుని తల్లిదండ్రుల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.