చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

by Disha Web Desk 15 |
చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ, సదాశివపేట : చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పీఠం చెరువు రాజేంద్రనగర్ హైదరాబాద్ కు చెందిన లక్ష్మణ్( 20) పట్టణంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం పట్టణ శివారులోని ఊబచెరువులో తల్లి సునీత, వదిన జ్యోతితో కలిసి బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోగా ఈత రాని లక్ష్మణ్ చెరువులో పడి నీట మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం గాలించారు. రెండో రోజు గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.


Next Story

Most Viewed