డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

by Disha Web Desk 23 |
డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
X

దిశ,ఉప్పల్: డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు,ఉప్పల్ పోలీసుల సహకారంతో డ్రగ్స్ తరలిస్తున్న మనోజ్(23), బుద్ధ రామ్(32) అనే ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా సభ్యులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ రాజస్థాన్ రాష్ట్రంలోని జోధాపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు అధిక డబ్బు సంపాదించాలి అనే ఆశతో రాజస్థాన్ లోని డ్రగ్స్ పెడ్లర్ వద్ద తక్కువ ధరలకి గ్రామ్ ఎండీఎంఏ 5 వేలకు,గ్రామ్ ఓపియం 2 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో 10 వేల నుంచి 12 వేల వరకు అమ్ముతున్నారు. బుద్ధ రామ్ పై గతంలో కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి.ఆ కేసు లో బుద్ధ రామ్ పరారి లో ఉన్నాడు. నిందితుల దగ్గర నుంచి 500 గ్రాముల నల్లమందు,100 గ్రాముల ఎండీఎంఏ,నాలుగు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులనిద్దరిని రిమాండ్ తరలించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.


Next Story