మద్యం మత్తులో గొడవ.. స్నేహితుడి హత్య

by Disha Web Desk 11 |
మద్యం మత్తులో గొడవ.. స్నేహితుడి హత్య
X

దిశ, రాజేంద్రనగర్ : మద్యం మత్తులో జరిగిన గొడవలో కొందరు తమ స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్ ల్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మధు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మిగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి మహమ్మద్ అర్బాజ్ (25) కు తన స్నేహితులతో గొడవ జరిగింది. వీరంతా మద్యం మత్తులో ఉన్నారు. ఈ క్రమంలో మిగతావారు అతనిపై దాడి చేసి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ మధు ఆధ్వర్యంలో సిబ్బంది, క్లూస్ టీం అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ మధు పేర్కొన్నారు.



Next Story