రెండు గ్రామాలను ఉలిక్కిపడేలా చేసిన మహిళ.. అర్ధరాత్రి మర్డర్‌తో కలకలం

by Disha Web Desk |
రెండు గ్రామాలను ఉలిక్కిపడేలా చేసిన మహిళ.. అర్ధరాత్రి మర్డర్‌తో కలకలం
X

దిశ, వేలేరుపాడు : తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు భర్త. ఇంట్లోకి వచ్చిన అతడిని గొడ్డలిలో నరికి అంతమొందించాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జరిగింది. అర్థరాత్రి వెలుగు చూసిన ఈ దారుణంతో రెండు గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కుక్కునూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుమెట్ట గ్రామానికి చెందిన చిచ్చడి కృష్ణ (45) తరుచూ కొత్తూరు గ్రామంలోని కుర్సం వెంకటేష్ ఇంటికి వచ్చివెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో వెంకటేష్ భార్యతో కృష్ణకి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధాన్నికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ గత కొన్ని రోజులుగా కోపంతో ఊగిపోయే వాడు. ఈ సమస్యకు పరిష్కారం అతన్ని అంతమొందించడమే అని భావించాడు.

ఈసారి కృష్ణ తన ఇంట్లో అడుగుపెడితే ఎలాగైన హత్య చేయాలని పథకం వేసుకున్న వెంకటేశ్.. ఎప్పటి లాగే రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణ తలపై గొడ్డలితో బలంగా మోదాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. అతడి అరుపులు విన్న స్థానికులు వెంటనే తేరుకుని తీవ్రగాయాల పాలైన కృష్ణను వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కప పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.



Next Story

Most Viewed