మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ..

by Disha Web Desk 23 |
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ..
X

దిశ,మంచిర్యాల : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మృత్యువాత పడగా, తాజాగా మరో విద్యార్థి చనిపోవడంతో జిల్లాలో విషాదం నెలకొంది.

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో సుభాష్ నగర్ కు చెందిన నూన్ సావత్ అరవింద్ (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న వెలువడిన ఫలితాల్లో గణితంలో తప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్ ఇంటి ఆవరణలో రాడుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం రాత్రి ఈ ఘటన జరుగగా ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి చనిపోయాడు. తండ్రి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ సంతోష్ వెల్లడించారు.

బుధవారం తాండూరు మండలం అచ్చుల పూర్ గ్రామానికి చెందిన మైధం సాత్విక్ (18), దొరగారి పల్లెకు చెందిన తేజస్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృత్యువాత పడిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed