రైలు ఢీకొని విద్యార్థిని మృతి

by Disha Web Desk 15 |
రైలు ఢీకొని విద్యార్థిని మృతి
X

దిశ ,చిన్నశంకరంపేట : ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి ఎస్సై తౌర్య నాయక్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల రమ్య (18 ) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తుండగా గ్రామంలో కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్ మాస్టర్ చూసి కామారెడ్డి రైల్వే ఎస్సైకు సమాచారం అందించగా ఆయన సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed