హోటల్ భోజనంలో గాజు ముక్క

by Disha Web Desk 15 |
హోటల్ భోజనంలో గాజు ముక్క
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అన్నంలో గాజు ముక్క వచ్చిన సంఘటన సిద్దిపేట నాగుల బండ సమీపంలోని ఓ హోటల్ లో చోటు చేసుకుంది. బాధితుడు జహంగీర్ తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట పట్టణానికి పనినిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో హరిత మినర్వా హోటల్ లో భోజనం చేయడానికి అగినట్లు తెలిపారు. హోటల్ బాయ్ తీసుకొచ్చిన ఆహారంలోగాజు ముక్క రావడంతో ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు పుడ్ సెప్టీ అధికారి అనుష సంఘటనా స్థలానికి చెరుకొని సంబంధిత ఆహార పదార్థాలను సీజ్ చేసి, హోటల్ వంట గది పరిసరాలను పరిశీలించారు. జహంగీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పుడ్ సెప్టీ అధికారి అనుష తెలిపారు.


Next Story