రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండలం భైరాపూర్ చౌరస్తా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నీరడి సాయిలు (45) అనే వ్యక్తి మృతి చెందినట్లు బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నీరడి సాయిలు బీర్కూర్ నుండి లింగాపూర్ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని, దీంతో మృతుడు కిందప డిపోవడంతో తలకు తీవ్రంగా గాయమై తల, ముక్కు భాగాల నుండి తీవ్రంగా రక్తస్రావమైనట్టు పేర్కొన్నారు. దాంతో 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పినట్లు ఎస్ ఐ వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదన్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.


Next Story

Most Viewed