చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం..

by Disha Web Desk 23 |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం..
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్ గ్రామానికి చెందిన నాగోసే శంకర్ 28. చేపల వేటకు వెళ్లి వాగులో పడి మృతి చెందాడు. సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం శంకర్ కొంతమంది స్థానికులతో కలిసి గ్రామ సమీపంలోని మోపెడ్ వాగుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో శంకర్ ప్రమాదవశాత్తు జారీ వాగులో పడి నీటమునిగాడు. తనతో వచ్చిన స్థానికులు గమనించి శంకర్ ను కాపాడే ప్రయత్నం చేశారు.గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీసి తీశారు. వాగులో నీటి లోతు అధికంగా ఉండటంతో నీటమునిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed