- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నడుచుకుంటూ వెళ్తున్నయువతి మెడలోని గొలుసు చోరీ
by Disha Web Desk 15 |
X
దిశ, చంపాపేట్ : నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి మెడలో నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు బంగారు గొలుసులు దొంగలించిన సంఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలోని శ్రీలక్ష్మి హాస్టల్ ప్రాంతానికి చెందిన యువతి (20) బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతుంది. కాగా మంగళవారం రాత్రి పని నిమిత్తం బయటికి వెళ్లి తిరిగి హాస్టల్ కు నడుచుకుంటూ వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు యువతి మెడలోని 13 గ్రాముల బంగారు గొలుసును దొంగలించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీనిపై యువతి ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.
Next Story