ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి.. ఆ పార్ట్‌లపై గాయాలు ఎలా అయ్యాయి..?

by Disha Web Desk |
ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి.. ఆ పార్ట్‌లపై గాయాలు ఎలా అయ్యాయి..?
X

దిశ,ఉప్పల్: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు అనుమానస్పదస్థితిలో మృతిచెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఐదేళ్లుగా సాగుతున్న అక్రమ సంబంధంలో వచ్చిన గొడవలతోనే ప్రియుడు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతికి ముందు రోజే ప్రియుడి ఒంటిపై గాయాలు ఉండటం.. ఆ మరుసటి రోజే ప్రియురాలి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సెక్టార్ ఎస్సై రమేష్ మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

జగన్ చారి(52)కి, పద్మావతికి 30 ఏళ్ల క్రితమే వివాహం అయింది. పటేల్ నగర్‌లో నివాసముంటున్న వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కార్పెంటర్ పనిచేస్తున్న జగన్ చారికి ఐదేళ్ల క్రితం కేసీఆర్ నగర్‌లో ఉంటున్న భువనేశ్వరి అనే మహిళతో పరిచయం ఏర్పడి.. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి జగన్ చారి తరచూ భువనేశ్వరి ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భువనేశ్వరి ఇంటికి వెళ్లిన జగన్‌చారికి ఆమెకు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే ప్రియుడిపై దాడి జరిగినట్టు తెలుస్తు్ంది.

అదే రాత్రి పటేల్ నగర్‌లోని తన సొంత నివాసానికి జగన్ చారి వచ్చారు. అయితే భర్త చెంపలు, వీపుపై గాయాలు ఉండటంతో కంగారుపడిన భార్య పద్మావతి గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించింది. అయినా జగన్ చారి నోరు మెదపలేదు. సోమవారం ఉదయం కేసీఆర్ నగర్‌లోని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు జగన్ చారి. సరిగ్గా ఉదయం 11 గంటలకు పద్మావతికి రాజు అనే వ్యక్తి ఫోన్ చేసి ‘మీ భర్త ఉరివేసుకున్నాడు’ చెప్పాడు.

షాక్‌కు గురైన పద్మావతి వెంటనే తన బంధువులను తీసుకొని కేసీఆర్ నగర్‌లోని భువనేశ్వర్ ఇంటికి వెళ్లింది. కానీ అప్పటికి జగన్ చారి మృతిచెంది ఉన్నాడు. పద్మావతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed