- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా ప్రతాపం చూపిస్తోంది. ప్రధానంగా స్కూల్స్, కాలేజీల్లో కరోనా పంజా విసురుతోంది. దీంతో స్కూల్స్, కాలేజీలను మూసివేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండగా.. తాజాగా ఒకే కాలేజీలో 140 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ఒక కాలేజీలో సోమవారం విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించగా.. 140 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కాలేజీ యజమాన్యం, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకేసారి భారీగా కేసులు బయటపడటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Next Story