ఒకే కాలేజీలో 140 మంది విద్యార్థులకు కరోనా

by  |
ఒకే కాలేజీలో 140 మంది విద్యార్థులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా ప్రతాపం చూపిస్తోంది. ప్రధానంగా స్కూల్స్, కాలేజీల్లో కరోనా పంజా విసురుతోంది. దీంతో స్కూల్స్, కాలేజీలను మూసివేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండగా.. తాజాగా ఒకే కాలేజీలో 140 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ఒక కాలేజీలో సోమవారం విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించగా.. 140 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కాలేజీ యజమాన్యం, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకేసారి భారీగా కేసులు బయటపడటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Next Story