ఇదెక్కడి దారుణం.. ఆస్పత్రిలో బెడ్ పైన ఉన్న వారిపై దాడులు

by Mahesh |
ఇదెక్కడి దారుణం.. ఆస్పత్రిలో బెడ్ పైన ఉన్న వారిపై దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల వేళ రాష్ట్రంలోని పల్నాడు, తిరుపతి, గుంటూరు, తాడిపత్రి, నరసరావుపేట, రెంటచింతల, చంద్రగిరి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని, సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు చేసుకున్న దాడుల వల్ల గాయపడిన కొంతమంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు ఆస్పత్రిలో దూరి చికిత్స తీసుకుంటున్న వారిపై ఎటువంటి కనికరం లేకుండా దాడులకు పాల్పడటం ఆ వీడియో కనిపించింది. కాగా ఈ వీడియోలో ఉన్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed