- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రామంలో ఇప్పటికే సుమారుగా 20 మంది వరకు డెంగ్యూ బారిన పడినట్టుగా గ్రామస్థులు తెలిపారు. రోజురోజుకు గ్రామంలో డెంగ్యూ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో 6 సంవత్సరాల వయస్సు గల రుషి అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత పది రోజుల క్రితం రుషి తీవ్ర అస్వస్థతకు గురి కాగా కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గక పోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత పది రోజులుగా రుషి చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న రుషి సోమవారం ఆస్పత్రిలో మృతి చెందాడు. బాలుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.