లోన్ కట్టాలంటూ రాజాసింగ్‌కు టెలీ కాలర్ ఫోన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే..!

by Disha Web Desk 19 |
లోన్ కట్టాలంటూ రాజాసింగ్‌కు టెలీ కాలర్ ఫోన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వెహికిల్ లోన్ కట్టాలంటూ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక టెలీ కాలర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ చేసింది. ఇర్ఫాన్ అనే వ్యక్తి షేక్ మహమ్మద్ పేరిట వెహికిల్ లోన్ తీసుకున్నారని ఆమె రాజాసింగ్‌కు వివరించింది. కాగా బదులిచ్చిన రాజాసింగ్ ఎవరి పడితే వారు నెంబర్ ఇస్తే కాల్ చేస్తారా? అంటూ టెలీ కాలర్‌ను ప్రశ్నించారు. తాను ఇర్ఫాన్ కాదని, ఎమ్మెల్యే రాజసింగ్ అంటూ ఆమెకు వివరించారు. తాను ముస్లింలకు అయ్యను అంటూ పేర్కొన్నారు. కాగా టెలీ కాలర్ స్పందిస్తూ ఈ నంబర్ ఉండటం వల్లే కాల్ చేసినట్లుగా సదరు టెలీకాలర్ చెప్పగా.. ఒకసారి గూగుల్, యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి తన గురించి తెలుసుకోవాలని రాజాసింగ్ సూచించారు. ముస్లింలకు, తనకు ఎక్కడైనా మ్యాచ్ అయితదా? అంటూ టెలీకాలర్‌కు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే రాజాసింగ్ నంబర్ ఇవ్వడంతో ఈ పొరపాటు జరిగింది.

Next Story

Most Viewed