రేపు ఇందూర్ కు అమిత్ షా రాక

by Disha Web Desk 15 |
రేపు ఇందూర్ కు అమిత్ షా రాక
X

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బీజేపీ బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరు కావాలని, సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed