కమలం పువ్వు గుర్తుకు ఓటు వెయ్యండి

by Disha Web Desk 15 |
కమలం పువ్వు గుర్తుకు ఓటు వెయ్యండి
X

దిశ, గుమ్మడిదల : పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి దేశ అభివృద్ధికి సహకరించాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిన్నారం మండల పరిధిలోని సోలాక్ పల్లి, గడ్డపోతారం జిన్నారం గ్రామాల్లో, గుమ్మడిదాల మండల పరిధిలోని అన్నారం, బొంతపల్లి, గుమ్మడిదల మండల కేంద్రంలో గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ తో కలిసి బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. అవనీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతి మయంగా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తే.. నేడు మళ్లీ కాంగ్రెస్ అదే దారిలో పయనిస్తుందని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలను నేటివరకు అమలు చేయలేకపోయారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి 400కు పైగా సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఆ నరేంద్రుడి పాలనలో అవకాశాన్ని కల్పిస్తూ జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. మెదక్ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా సేవలను అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగు గోవర్ధన్ రెడ్డి, జగన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, నాయకులు గిద్దె రాజు, రాజీ రెడ్డి, చింతల యాదగిరి, రాం రెడ్డి, శేఖర్, అంజి రెడ్డి, ఉదయ్ సాగర్, రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి, భాస్కర్ గౌడ్, బల్ రెడ్డి, సృజున లక్ష్మి, నర్సింగరావు, విజయ భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed