- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గద్వాలలో అనూహ్య రాజకీయ పరిణామాలు.. బీజేపీ వైపు గొంగళ్ల రంజిత్
దిశ, గద్వాల ప్రతినిధి: గద్వాల నియోజకవర్గం లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపెడుతునట్టు సమాచారం. గొంగళ్ల రంజిత్ కుమార్ గద్వాల్ నియోజకవర్గం లో సీడ్ పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ,సమస్య లపై రైతులకు న్యాయం చేస్తూ, నియోజకవర్గం లో ఒక ప్రముఖ స్థానం ఏర్పర్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 14 వేల ఓటు బ్యాంకు ను ఆయన సంపాదించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మల్లు రవి అనేక సార్లు గొంగళ్ల రంజిత్ ను మద్దతు కోరడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్లి కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన మద్దతు కోరడం జరిగింది.
కానీ ఆయన తన మద్దతుదారులకు రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ వర్గానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని మల్లు రవి ని కోరడం జరిగిందని దానికి మల్లు రవి సరైన హామీ ఇవ్వలేదని అందుకే బీజేపీ అభ్యర్థి అయిన భరత్ కుమార్ కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని ‘దిశ’ పత్రికకు ఆయన తెలిపారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పినందుకె బేషరతుగా బిజెపి పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తెలిపారు.